తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి 

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 07:59 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి 

తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభం అయ్యాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలను ప్రారంభించారు. పోలీసుల హెచ్చరికలను ఫ్లెక్సీలకే పరిమితం చేసి కోళ్ల కొట్లాను ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యేనే కోడి పందాలు ప్రారంభించడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. 

జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం, రావులపాలెంతోపాటు పలు చోట్ల పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. అమలాపురం రూరల్ మండలంలోని హిందుపల్లి, కొంకపల్లి, గున్నెపల్లి సహా అల్లవరం మండలంలోని అన్ని గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. 

పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా కత్తి కట్టి కోడిని బరిలోకి దించుతున్నారు. కృష్ణా జిల్లాలోనూ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలో కోలేటికోటలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.