క్షేమం : అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం

సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 10:36 AM IST
క్షేమం : అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం

సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.

సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు. పాపను స్వాధీనం చేసుకున్నారు. 8 రోజుల పాప క్షేమంగా ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాప క్షేమంగా ఉందన్న సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. 

పోలీసులల కథనం ప్రకారం.. మాధవి, మల్లేష్ దంపతులు. ఏప్రిల్ 30 శుక్రవారం మాధవి డెలివరీ కోసం భర్త మల్లేష్ తో కలిసి సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ ఆస్పత్రికి వచ్చింది. అదే రోజునే మాధవి ప్రసవించింది. సోమవారం ఉదయం (మే 6,2019) ఆయా వచ్చి పాపకు పచ్చ కామెర్లు వచ్చాయని ట్రీట్ మెంట్ కోసం శిశువును తీసుకెళ్లింది. అయితే పాపను అప్పగించే ముందు తల్లిదండ్రుల పేర్లు నిర్ధారణ చేసుకోకుండా మే 7 మంగళవారం వేరే వారికి పాపను అప్పగించారు. అయితే తల్లిదండ్రులు పాప గురించి ఆయాను అడగగా ఎప్పుడో అప్పగించామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 

దీంతో తల్లిదండ్రులు డీఎంహెచ్ వో దగ్గరకు వెళ్లగా అక్కడ కూడా నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. ‘మీరు దగ్గరుండి చూసుకోవాలి’ అని తల్లిదండ్రులకు చెప్పారు. పాప తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి దగ్గర ఆందోళన చేపట్టారు. సంఘటనాస్థలికి డీఎస్ పీ చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పాప క్షేమంగా ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.