మేము చనిపోతున్నాం..మా కోసం వెతకొద్దు’..ముగ్గురు అమ్మాయిలు మెసేజ్ కలకలం

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 08:46 AM IST
మేము చనిపోతున్నాం..మా కోసం వెతకొద్దు’..ముగ్గురు అమ్మాయిలు మెసేజ్ కలకలం

“మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి బైటకు వెళ్లారు.

అలా వెళ్లిన వారు మళ్లీ తిరిగి రాలేదు. కొంతసేపటికి మొబైల్ ఫోన్‌లో “మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ తల్లికి SMS పెట్టారు. దీంతో తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన ఆ ముగ్గురు యువతుల కోసం గాలిస్తున్నారు. ఈ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. 

అయితే అదృశ్యమైన ఆ ముగ్గురు యువతులు నింది అనూరాధ (22) నింది తులసి (20) నింది కోమలి (17) ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ద్వారక ఏసీపీ ఆధ్వర్యంలో మూడు పోలీస్ బృందాలు అదృశ్యమైన అమ్మాయిల కోసం గాలిస్తున్నారు.