ఈ 3 రోగాలకు ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు : సీఎం జగన్ సెటైర్లు

మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 08:11 AM IST
ఈ 3 రోగాలకు ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు : సీఎం జగన్ సెటైర్లు

మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా

మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది.. కానీ.. అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదన్నారు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది..కానీ.. చెడు దృష్టికి మాత్రం ఎక్కడా చికిత్స లేనే లేదన్నారు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి.. కానీ.. మెదడు కుళ్లితే మాత్రం.. చికిత్సలు లేనే లేవు అన్నారు.

ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులను.. మహానుభావులుగా చూపించే కొన్ని చానళ్లు, పత్రికలు ఉన్నాయన్న సీఎం జగన్.. వాళ్లను బాగు చేసే మందులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. వీటన్నింటి మధ్య మీ బిడ్డగా మీకోసం పని చేస్తున్నా అని సీఎం చెప్పారు. నిజాయితో పని చేస్తున్నామన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నామన్నారు.

సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో దశ కంటి వెలుగును నేటి(ఫిబ్రవరి 18,2020) నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తామన్నారు జగన్. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని పీహెచ్ ప్రమాణాలకు తీసుకొస్తామన్నారు.

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రూ.15వేల 337 కోట్లతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. 3వ దశలో 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తామన్నారు. 3వ దశ కంటి వెలుగును కర్నూలు నుంచి ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు సీఎం జగన్. అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే అన్నారు సీఎం జగన్. 

* కర్నూలులో వైఎస్ఆర్ కంటి వెలుగు-3 ప్రారంభం
* జూలై 31వ తేదీ వరకు కొనసాగనున్న కంటి వెలుగు కార్యక్రమం
* 56 లక్షల 88వేల 424మందికి స్క్రీనింగ్ పరీక్షలు
* రెండు కొత్త కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
* ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు

* అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దుతాం
* మూడేళ్లలో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేస్తాం
* రూ.15వేల 337 కోట్లతో ఆసుపత్రుల ఆధునికీకరణ
* 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల రూపురేఖలు మారుస్తాం
* 52 ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ

* ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి రూ.700 కోట్లు
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐపీహెచ్ఎస్ ప్రమాణాలు తీసుకొస్తాం
* జిల్లా ఆసుపత్రులనూ అభివృద్ధి చేస్తాం
* అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువే
* అవ్వా తాతలకు కంటి చూపు ఇబ్బందులు రాకుండా కంటివెలుగుకి శ్రీకారం
* నేటి నుంచి 175 నియోజకవర్గాల్లో కంటి వెలుగు
* మొత్తం 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం