పొలం పనులు చేస్తుండగా పిడుగుపడి దంపతుల మృతి
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు. కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఉపేందర్, ఈశ్వరమ్మలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఉపేందర్, ఈశ్వరమ్మలు రోజూలాగే శనివారం (నవంబర్ 2, 2019) తమ పొలంలో పనులు కోసం వెళ్లారు.
పోలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీంతో భార్యభర్తలు సమీపంలోని చెట్టు దగ్గరకు వెళ్లారు. అయితే అదే చెట్టుపై పిడుగుపడడంతో ఇద్దరూ స్పాట్లోనే మృతి చెందారు. వీరి మృతితో ఇద్దరు కూతుర్లతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. దంపతులిద్దరూ చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.