ఎస్పీ బాలు వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుంది
కరోనా వైరస్ సోకి గత 10 రోజులుగా చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రకటించారు.
ఆయన శనివారం ఆగస్ట్ 22వ తేదీ సాయంత్రం ఎమ్జీఎమ్ ఆస్పత్రికి వెళ్లి గాన గంధర్వుడు ఎస్పీబీని పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వైద్యుల ద్వారా ఆయనకు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు….ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు. కరోనా నుంచి కోలుకోవడానికి ప్లాస్మా చికిత్స అందిస్తున్నామని రెండు రోజులు వెంటిలేటర్పైనే ఉంచి చికిత్స చేయనున్నట్లు వైద్యలు వివరించారు.