ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు డీఏ నిలిపివేత
AP government employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పించనర్లకు ఏపీ ప్రభుత్వం కరవు భత్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.