దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం
Bandaru Dattatreya :మాజీ కేంద్రమంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద గవర్నర్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బయటకు దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో దత్తాత్రేయకు స్వల్ప గాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. తర్వాత దత్తాత్రేయ వేరే కారులో వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.