Bhumi Pednekar : బాలీవుడ్ లో కరోనా భయం, నటి భూమికి పాజిటివ్
అలియా భట్, అక్షయ్ కుమార్ లకు కరోనా పాజిటివ్ రాగా..మరో ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.
Covid-19 : భారతదేశంలో కరోనా భయపెట్టిస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ లక్షకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం భయాందోళనలకు గురి చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన హీరోలు, హీరోయిన్లు, చిత్ర యూనిట్ లోని వారికి కరోనా సోకుతోంది. ఇప్పటికే పలువురు వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అలియా భట్, అక్షయ్ కుమార్ లకు కరోనా పాజిటివ్ రాగా..మరో ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని వారు స్వయంగా..సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆరోగ్యంగానే ఉన్నట్లు నటి భూమి తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు, వైద్యుల సలహాలు పాటిస్తున్నానన్నారు. ఆవిరి పట్టడం, విటమిన్ సి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపారు. తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. దయచేసి కరోనాను నిర్లక్ష్యం చేయకండి. అన్ని జాగ్రత్తలు తీసుకొండి. మాస్కు ధరించండి. సామాజిక దూరం పాటించండి అంటూ ప్రజలకు నటి భూమి సూచించారు.
ఇక బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మందికి కరోనా వైరస్ సోకింది. టాప్ స్టార్స్ కరోనా బారిన పడుతుండడంతో బాలీవుడ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమీర్ ఖాన్, రణ్బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, అక్షయ్ కుమార్ సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్పాయ్, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది.
Read More : Malaysia : ఇతని లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు