Kangana Ranaut: పప్పు పార్టీ పనే ఇది.. ఆవు, ఆక్సిజన్ కంగనా పేరిట ఫేక్ ట్వీట్..
Kangana Ranaut Fake Tweet: కరోనా వైరస్ సెకండ్ వేవ్లో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సమస్య ఎక్కువగా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 బాధితులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతుండగా.. అటువంటి పరిస్థితిలో, బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ట్విట్టర్ ద్వారా ఆక్సిజన్ వినియోగాన్ని పెంచడానికి మరిన్ని చెట్లను నాటాలని సూచించారు. దీనిపై ట్రోల్స్ విపరీతంగా అవ్వగా.. కొన్ని ఫేక్ ట్వీట్లు కూడా తయారయ్యాయి.
కంగనా ఆక్సిజన్ ట్వీట్ తరువాత, ఒక నకిలీ ట్వీట్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది, దీనిలో ఒక వ్యక్తి ఆవుకు ఎదురుగా నిలబడి నోటిని ఆవు మూతి దగ్గర పెట్టి ఉన్నాడు. దీనిపైన.. ఎవరైతే ఆక్సిజన్ కొరత ఉన్నట్లు భావిస్తున్నారో ఇలా ప్రయత్నించండి. ఆవు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది కాబట్టి, తక్కువ సమయంలో ఆక్సిజన్ను పొందడానికి ఇదొక సులభమైన మార్గం. అని అందులో ఉంది. ఈ నకిలీ ట్వీట్ వైరల్ అయ్యాక.. కంగనాను పలువురు ట్యాగ్ చేస్తూ పోస్టింగ్లు చేశారు.
ఈ క్రమంలో కంగనా ఫోటోను రీట్వీట్ చేసి.. “మోడీ జీ ప్రచారంలో ఒక మాట అన్నారు.. ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు చేస్తూనే ఉంటారు. మీరు అలాంటి అబద్ధాలను నిజమని నమ్మడం మొదలుపెడితే, మీరు సోమరితనంతో ఉన్నట్లే.. మిమ్మల్ని నాశనం చేసే శక్తిని మీరు నాకు ఇస్తున్నారు. మీరు ఉద్దేశపూర్వకంగా ఏమి చేసినా కూడా నా దగ్గర కోల్పోవటానికి లేదా సంపాదించడానికి ఏమీ లేదు.” అంటూ రాసుకొచ్చారు.
Reminds me of one of Modi ji’s campaigns ‘ They aren’t after me they are after you but I am in the way’ if you choose to believe such lies because you are too lazy to confirm, you give them the power to destroy you , whatever you do choose wisely, I have nothing to loose or gain https://t.co/dhd41tdcyV
— Kangana Ranaut (@KanganaTeam) April 22, 2021
తర్వాతి ట్వీట్లో.. ఈ రోజు రాజ్పుత్ బబ్బర్ సింహం ఒక మహిళను విచ్ఛిన్నం చేయడానికి తప్పుడు ప్రచారాలు, వ్యూహాలు వేస్తుంది. సమయాన్ని, లెక్కలేనంత డబ్బును ఖర్చు చేస్తుంది. రాజకీయాల నుండి సినిమా మాఫియా వరకు పప్పు పార్టీ ప్రజలందరూ నాపై తప్పుడు ప్రచారాలు చేయడంలో విఫలం అవుతున్నారు.అంటూ కంగనా ఫైర్ అయ్యింది.
Today effect of Rajput Babbar Sherni is such that huge campaigns unbelievable amount of money, strategies and time being invested to break one single woman yet all Pappu party from political to movie mafia failing miserably at it, ek ladki ne sab Pappu ki watt laga ke rakhi hai. https://t.co/dhd41tuNXv
— Kangana Ranaut (@KanganaTeam) April 22, 2021
వాస్తవానికి, కంగనా రనౌత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా.. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందా? అయితే చాలా సింపుల్.. అందరూ మొక్కలు నాటండి.. ఆక్సిజన్ ఉత్పత్తి దానంతటదే జరుగుతుంది. అంటూ రాసుకొచ్చింది. అయితే కొందరు ఫేక్ ట్వీట్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. మహారాష్ట్రాలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి, కంగనా రనౌత్కి కొన్ని రోజులుగా మాటలు యుద్ధం సాగుతూనే ఉంది.