Tokyo Olympics 2020: లాస్ట్ మెడల్ గోల్డ్ అయితే ఆ కిక్కే వేరబ్బా.. బంగారు బాబు నీరజ్
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించిన నీరజ్ చోప్రా ఎట్టకేలకు స్వర్ణం సాధించారు.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించిన నీరజ్ చోప్రా ఎట్టకేలకు స్వర్ణం సాధించారు.
దీంతో మొత్తం ఇండియాకు ఏడు మెడల్స్ దక్కాయి. ఒక స్వర్ణం, రెండు రజత పతకాలతో పాటు మూడు కాంస్యాలు దక్కాయి.
రెజ్లింగ్ విభాగంలో:
రవి దాహియాకు సిల్వర్ పతకం రాగా, భజరంగ్ పూనియా కాంస్యం సాధించారు.
వెయిట్ లిఫ్టింగ్ లో:
ప్రస్తుత టోర్నీలో ఇండియాకు తొలి పతకం అందించారు మీరాబాయి చాను. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ సాధించి భారత్ పతకాల ఖాతాలో బోణీ కొట్టారు.
కలలను సాకారం చేస్తూ:
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్యం దక్కించుకున్నారు.
బాక్సింగ్ లో..
లవ్లీనా బాక్సింగ్ కాంస్యాన్ని దక్కించుకున్నారు.
హాకీ 41ఏళ్ల చరిత్రలో..:
హాకీ ఇండియా పురుషుల విభాగంలో చరిత్ర లిఖించారు. 41ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారి పతకం సాధించారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు కాంస్యం దక్కించుకుంది.
జావెలిన్ త్రో స్వర్ణం
టోక్యో ఒలింపిక్స్లో భారత్ను తొలి స్వర్ణం దక్కింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.