మహేష్ థియేటర్ ముచ్చటేసింది

ఏఎంబీ సినిమాస్‌ని పొగిడిన మెగాస్టార్.

  • Published By: sekhar ,Published On : January 28, 2019 / 10:10 AM IST
మహేష్ థియేటర్ ముచ్చటేసింది

ఏఎంబీ సినిమాస్‌ని పొగిడిన మెగాస్టార్.

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్‌తో టై‌ అప్ అయ్యి, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్‌ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాని ఈ లగ్జీరియస్ మల్టీప్లెక్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసాడు బాలయ్య. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఏఎంబీ సినిమాస్‌లో ఒక మూవీ చూసి, ఏఎంబీ సినిమాస్‌ని పొగిడాడు. చిరంజీవి, అల్లు అరవింద్ కలిసి, ఏఎంబీలో మూవీ చూసి, బయటకి వస్తూ మీడియాతో మాట్లాడారు.

మహేష్ నిర్మించిన ఏఎంబీ సినిమాస్ అత్యద్భుతంగా ఉందనీ, సౌండ్ సిస్టమ్ అదిరిపోయిందనీ, వీటితో పాటు హైదరాబాద్‌లో, ఏ మల్టీప్లెక్స్‌లోనూ లేని ఫెసిలిటీస్ ఏఎంబీ సినిమాస్‌లో ఉన్నాయని మెగాస్టార్ అన్నారు. ఈ సందర్భంగా చిరు, అరవింద్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ థియేటర్‌లో సినిమా చూసి స్పందించిన చిరుకి, ఏఎంబీ సినిమాస్ మేనేజ్‌మెంట్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పింది.