Pm Modi : జాగ్రత్త.. ఆ పార్టీ గెలిస్తే మీపై వారసత్వ పన్ను విధిస్తారు- ప్రధాని మోదీ వార్నింగ్

తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దొంగదారిలో ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారు.

Pm Modi : జాగ్రత్త.. ఆ పార్టీ గెలిస్తే మీపై వారసత్వ పన్ను విధిస్తారు- ప్రధాని మోదీ వార్నింగ్

Pm Modi : జహీరాబాద్ లో బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక గూటి పక్షులే అని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పెద్ద స్కామ్ చేసిందన్న మోదీ.. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందన్నారు.

‘ఓటుకు నోటు కేసును గతంలో బీఆర్ఎస్ తొక్కి పెట్టింది. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిని కాంగ్రెస్ తొక్కిపెడుతోంది. ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పదేళ్లుగా ఎన్డీయే చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారు. గతంలో కాంగ్రెస్ అవినీతిని దేశమంతా చూసింది. కాంగ్రెస్.. వారసత్వం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది.

గతంలో తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దొంగదారిలో ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదు. దోపిడీకి మరో మార్గాన్ని కూడా కాంగ్రెస్ కనిపెట్టింది. మీ సంపదలో 55శాతం లాక్కుంటామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ గెలిస్తే మీపై వారసత్వ పన్ను విధించబోతున్నారు’ అని హెచ్చరించారు ప్రధాని మోదీ.

Also Read : సీఎం రేవంత్ రెడ్డి అరెస్టుకు బీజేపీ కుట్ర: సీపీఐ నారాయణ