SS Rajamouli : క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్..
దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాహుబలి
దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా మూడో భాగం (బాహుబలి-3) త్వరలోనే తెరకెక్కనుందనే వార్తలు వచ్చాయి. దాని సంగతి ఏమో కానీ.. దర్శకుడు రాజమౌళి ఓ అదిరిపోయే అప్డేట్ను చెప్పాడు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ అనే పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని చెప్పారు. దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలోనే రానుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
“మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది”. అని ఎక్స్లో రాసుకొచ్చారు.
Geetha Bhagat : ఈ యాంకర్ గురించి తెలుసా? సుమక్క లాగే పద్దతిగా దూసుకుపోతూ..
When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.
Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld
— rajamouli ss (@ssrajamouli) April 30, 2024
కాగా.. బాహుబలిని సినిమాని వివిధ రూపాల్లో తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని రాజమౌళి ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ గురించి స్వయంగా రాజమౌళి వెల్లడించడం విశేషం. అయితే.. ఇందులో ఏం చూపిస్తారు? అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, శివగామి, భళ్లాలదేవుడు, దేవసేన పాత్రలు ఉంటాయా? వీటితో పాటు ఇంకేమన్నా కొత్త పాత్రలు ఉంటాయా? అన్న సంగతి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Mehreen : మొన్న మృణాల్ చెప్పింది.. ఇవాళ మెహ్రీన్ చేసి చూపించింది.. హాస్పిటల్లో మెహ్రీన్..
ఇదిలా ఉంటే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.