Mehreen : మొన్న మృణాల్ చెప్పింది.. ఇవాళ మెహ్రీన్ చేసి చూపించింది.. హాస్పిటల్లో మెహ్రీన్..
ఇటీవల కాలంలో కెరీర్, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేస్తున్నారు.
ఇటీవల కాలంలో కెరీర్, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేస్తున్నారు. అలాంటి వారికి ఎగ్ప్రీజింగ్ అనేది ఓ వరంలా మారింది. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకుని.. కావాల్సినప్పుడు పిల్లలను కనే ఈ పద్దతినే ఇటీవల సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ ఓ వేదిక పై చెప్పింది. భవిష్యత్తులో దీని గురించి ఆలోచన చేస్తానని ఆమె వెల్లడిచింది. ఇప్పటికే కొద్ది మంది హీరోయిన్లు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా తాజాగా ఆ జాబితాలో మెహ్రీన్ కూడా చేరింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మెహ్రీన్ వెల్లడించింది. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును దాదాపుగా రెండేళ్లుగా సిద్దం చేసుకుంటున్నా. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని’ మెహ్రీన్ తెలిపింది. ఈ విషయం అనేది నా వ్యక్తిగతం. దీన్ని అందరికి చెప్పాలా? వద్దా ? అనే విషయం పై ఎంతో ఆలోచించాను. చివరకు నాలాంటి మహిళలు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్లు పెళ్లి, బిడ్డని కనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలిపింది.
Pushpa 2 Song Update : ‘పుష్ప’ టైటిల్ సాంగ్ రేపే.. టక్కేసిన పుష్ప రాజ్ కొత్త లుక్ చూశారా?
తన వరకు భవిష్యత్తు కోసం ఇది ఎంతో ముఖ్యమని భావించినట్లు తెలిపింది. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సాంకేతికత సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. తల్లి కావాలనేది తన కల అని మెహ్రీన్ అంది. ఇందుకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే ఎగ్ ఫ్రీజింగ్. ఇక ఆస్పత్రులు అంటే భయపడే నాలాంటి వాళ్లుకు ఇది సవాలే. ఆస్పత్రికి వెల్లిన ప్రతిసారి ఇంజెక్షన్స్ కారణంగా నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని అంటూ చెప్పింది. ఇక ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్దతి మంచిదా కాదా అంటే ఖచ్చితంగా మంచిదేనని చెబుతానంటూ ఆమె తెలిపింది. మీ కోసం చేయండి.. ఎప్పుడూ నా పక్కనే ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు ధన్యవాదాలు అని మెహ్రీన్ అంది.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
View this post on Instagram