Aditya Thackeray: షిండే ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.. మీకోసం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి..
ఏక్ నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి మీరు తిరిగి రావాలని అనుకుంటే ఎప్పుడూ మీకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.
Aditya Thackeray: ఏక్ నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి మీరు తిరిగి రావాలని అనుకుంటే ఎప్పుడూ మీకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు కలిసే అవకాశముందా? అని ఆదిత్య ఠాక్రేను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన బదులిస్తూ.. మాకు ద్రోహం చేసిన వారితో చేరిన వారికి ఇప్పటికే ఒక విషయం చెప్పానని, మీరు తిరిగి రావాలనుకుంటే రావొచ్చు, పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలపడం జరిగిందని అన్నారు. అయితే.. ప్రస్తుతానికి రెబల్ నేతలు మాతో టచ్ లో లేరని ఆదిత్య ఠాక్రే మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్కు కౌంటర్
బీజేపీతో కలిసి షిండే వర్గం మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. సీఎంగా ఏక్ నాథ్ షిండే కొనసాగుతున్నారు. అయితే ఆ ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేఖమని, షిండే ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. ఇదిలాఉంటే శివసేన పార్టీ కోసం ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం మధ్య పోరు జరుగుతుంది. కోర్టులకు సైతం వివాదం చేరింది. తాజాగా తమ మెజార్టీలను వెల్లడించాలని ఇరు వర్గాలను ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది.