Telangana Corona News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో(507) పోలిస్తే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 29వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 199 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 29 కేసులు వెల్లడయ్యాయి
Telangana Corona News : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో(507) పోలిస్తే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 29వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 199 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 29 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 30వేల 815 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 23వేల 884 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 820కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 33వేల 046 మందికి కరోనా పరీక్షలు చేయగా, 507 మందికి పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.18.08.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/r6yZGtMjFT— IPRDepartment (@IPRTelangana) August 18, 2022