Kothapalli Subbarayudu : ఎన్ని కేసులు పెట్టినా ముదునూరికి భయపడను : కొత్తపల్లి సుబ్బారాయుడు
పవన్ వారాహి యాత్రను ఆపే సత్తా ముదునూరికి లేదని చెప్పారు. నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలనేదే ముదునూరి లక్ష్యమని పేర్కొన్నారు.
![Kothapalli Subbarayudu : ఎన్ని కేసులు పెట్టినా ముదునూరికి భయపడను : కొత్తపల్లి సుబ్బారాయుడు Kothapalli Subbarayudu : ఎన్ని కేసులు పెట్టినా ముదునూరికి భయపడను : కొత్తపల్లి సుబ్బారాయుడు](https://10tv.in/wp-content/uploads/2023/06/Kothapalli-Subbarayudu.jpg)
Kothapalli Subbarayudu
Mudunuri Prasad Raju : ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజుపై మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నానని ఇప్పుడు తనపై కేసు పెట్టించారని మండిపడ్డారు. ముదునూరి ప్రసాదరాజు పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనపై కేసు పెట్టించారని ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే అధికార మదం, దుర్బుద్ధికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకునేందుకే ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ముదునూరికి భయపడేది లేదని స్పష్టం చేశారు.
పవన్ వారాహి యాత్రను ఆపే సత్తా ముదునూరికి లేదని చెప్పారు. నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా నాశనం చేయాలనేదే ముదునూరి లక్ష్యమని పేర్కొన్నారు.