Ambati Rambabu: ఎందుకిలా చేశారో అందరికీ తెలుసు: అంబటి రాంబాబు

అక్కడి ఎమ్మెల్యే, ఎంపీ రషీద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

Ambati Rambabu: ఎందుకిలా చేశారో అందరికీ తెలుసు: అంబటి రాంబాబు

విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారని, అది తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ ఆయన గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మొదట శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేయాలనుకున్నారని, ఆ తర్వాత వాయిదా వేసుకున్నారని తెలిపారు.

ఎందుకిలా చేశారో అందరికీ తెలుసని అంబటి రాంబాబు చెప్పారు. తమ పాలనలో టే ఈ 45 రోజుల్లో ఇప్పుడు ఎక్కువుగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని తెలిపారు. వినుకొండలో జరిగిన హత్య రాజకీయ హత్య కాదని చెబుతున్నారని అన్నారు. జిలాని గతంలో తమ పార్టీలో ఉన్నారని చెప్పారు.

అక్కడి ఎమ్మెల్యే, ఎంపీ రషీద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్‌లో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారని తెలిపారు. గంజాయి మత్తులో హత్య చేశాడని హోంమంత్రి అంటున్నారని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజుల తర్వాత కూడా గంజాయి దొరికితే ఆ పాపం వైసీపీదా అని నిలదీశారు.

హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత బాధ్యతగా మాట్లాడాలని అంబలి రాంబాబు చెప్పారు. అధికారంలో ఉన్నవారు వైసీపీని దూషిస్తూ కాలయాపన చేయకూడదని అన్నారు. కేంద్ర హోంమంత్రికి అన్ని వివరాలు ఇస్తామని తెలిపారు. జగన్ రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదని, టీడీపీనేనని చెప్పారు. రోజులు మారతాయని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

Also Read: సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయి: లావు శ్రీ కృష్ణ దేవరాయలు