Kotikalapudi Govinda Rao : జగన్ లా ఒక్కక్షణం కూడా పవన్ కళ్యాణ్ కు జీవించాలని లేదు : కొటికలపూడి గోవిందరావు
మొదటి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కు జ్వరం వల్ల ఎక్కువ మందిని కలవలేకపోయారని పేర్కొన్నారు. రెండో షెడ్యూల్లో పవన్ అందర్నీ కలుస్తారని తెలిపారు.
Kotikalapudi Govinda Rao press meet : భీమవరంలో మళ్లీ పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర జరుగుతుందని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత వారాహి యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో షెడ్యూల్ ను ప్రకటిస్తామని చెప్పారు. మొదటి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కు జ్వరం వల్ల ఎక్కువ మందిని కలవలేకపోయారని పేర్కొన్నారు.
రెండో షెడ్యూల్లో పవన్ అందర్నీ కలుస్తారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లా ఒక్కక్షణం కూడా పవన్ కళ్యాణ్ కు జీవించాలని లేదన్నారు.
జగన్ పై గత నెల (జూన్) 30వ తేదీన 20 కేసులు సీబీఐ నమోదు చేసిందని వెల్లడించారు. జులై 5 న జగన్ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారని పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని సీట్లను జనసేన గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధికి సహకరిస్తామని, అభివృద్ధి జరగపోతే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.