MM Keeravaani : చంద్ర‌ముఖి-2కి ప్రాణం పోసేందుకు రెండు నెల‌లు నిద్ర‌లేని రాత్రులు

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) హీరోగా 2005లో తెర‌కెక్కిన చిత్రం చంద్ర‌ముఖి. కామెడీ, ఎమోషన్స్‌, హారర్ ఇలా అన్ని మేళవింపుగా వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

MM Keeravaani : చంద్ర‌ముఖి-2కి ప్రాణం పోసేందుకు రెండు నెల‌లు నిద్ర‌లేని రాత్రులు

MM Keeravani

Chandramukhi 2- MM Keeravaani : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) హీరోగా 2005లో తెర‌కెక్కిన చిత్రం ‘చంద్ర‌ముఖి’. కామెడీ, ఎమోషన్స్‌, హారర్ ఇలా అన్ని మేళవింపుగా వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. భ‌య‌మంటే తెలియ‌ని వారికి సైతం భ‌యాన్ని ప‌రిచ‌యం చేసింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ వ‌స్తోంది. చంద్రముఖి-2(Chandramukhi 2)గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో లాఘ‌వ లారెన్స్‌(Raghava Lawrence), బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్(Kangana Ranaut) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్ష కృష్ణన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల బాష‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Jayant Savarkar : చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం.. సింగం న‌టుడు క‌న్నుమూత‌

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కారు అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా కీర‌వాణి చంద్ర‌ముఖి-2 సినిమాపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ‘చంద్ర‌ముఖి 2 సినిమాలోని పాత్ర‌లు మ‌ర‌ణ‌భ‌యంతో నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతుంటాయి. నా సంగీతంతో అద్భుత‌మైన స‌న్నివేశాల‌కు ప్రాణం పోసేందుకు రెండు నెల‌ల పాటు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపాను. గురు కిర‌ణ్‌, నా స్నేహితుడు విద్వాసాగ‌ర్.. నాకు విజ‌యం అందాల‌ని కోరుకోండి.’ అంటూ కీర‌వాణి ట్వీట్ చేశాడు.

Oppenheimer : శృంగార స‌న్నివేశంలో భగవద్గీత.. మండిప‌డుతున్న భార‌తీయులు.. తొల‌గించ‌క‌పోతే ఊరుకోం

కీర‌వాణి చేసిన ఈ ట్వీట్‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ఈ సినిమా ఈ ఏడాది వినాయ‌క‌చ‌వితి నాడు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.