Shivamogga : సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శన తర్వాత ఆవు మూత్రంతో క్యాంపస్ను శుద్ధి చేసిన కళాశాల విద్యార్థులు
కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ఎంవీ కళాశాలలో విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎంవీ కళాశాలను మంగళవారం సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన తర్వాత ఆ స్థలాన్ని శుద్ధి చేసేందుకు విద్యార్థులు క్యాంపస్ చుట్టూ గోమూత్రాన్ని చల్లారు....
![Shivamogga : సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శన తర్వాత ఆవు మూత్రంతో క్యాంపస్ను శుద్ధి చేసిన కళాశాల విద్యార్థులు Shivamogga : సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శన తర్వాత ఆవు మూత్రంతో క్యాంపస్ను శుద్ధి చేసిన కళాశాల విద్యార్థులు](https://10tv.in/wp-content/uploads/2023/08/College-students-purify-cam.gif)
College students purify campus
Shivamogga : కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ఎంవీ కళాశాలలో విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఎంవీ కళాశాలను మంగళవారం సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన తర్వాత ఆ స్థలాన్ని శుద్ధి చేసేందుకు విద్యార్థులు క్యాంపస్ చుట్టూ గోమూత్రాన్ని చల్లారు. (College students purify campus with cow urine) కాలేజ్లోని ఓ ప్రోగ్రాం హాల్లో డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. (after Prakash Raj visit)
East Sikkim : తూర్పు సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జవాన్లు మృతి
ఈ కళాశాలలో ప్రైవేట్ ఈవెంట్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. ఆందోళనకారులను లోపలికి రానీయకుండా కళాశాల వెలుపల బారికేడ్లు వేయడంతో పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. హిందీ, తమిళం, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లో ప్రతికూల పాత్రలు పోషించి పాపులర్ అయిన ప్రకాష్ రాజ్ కేంద్ర ప్రభుత్వం, అధికార భారతీయ జనతా పార్టీపై తరచూ విమర్శలు చేస్తుంటారు. దీంతో కొందరు విద్యార్థులు ప్రకాష్ రాజ్ కళాశాల సందర్శనపై నిరసనగా కళాశాల ఆవరణలో గోమూత్రం చల్లి శుద్ధి చేశారు.