Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు, ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు ప్రారంభించాయి. దీంతో..పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు, ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్

Chandrababu Arrest

Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన బస చేసి బస్సు నుంచి కిందకు రాగానే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసేందుకు రోడ్లమీదకు వచ్చారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. అలాగే పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేసారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు ప్రారంభించాయి. దీంతో..పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. కొందరు ప్రముఖ నాయకుల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.అలాగే నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకుల హౌజ్ అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతు..జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారని అక్కసుతో, చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉందని గంటా అన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు. నియంత సీఎం జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ కమ్యూనిస్టు నేతలు, ప్రజాసంఘాల నేతలు కూడా ఖండిస్తున్నారు. అరెస్ట్ చేసే ముందు నోటీసులు ఇవ్వాలని అలా ఇవ్వకుండా అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన అవరసం ఏంటీ అంటూ సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తనను ప్రశ్నించేవారిని అరెస్ట్ చేయటం జగన్ కు అలవాటుగా మారిపోయిందని ప్రతిపక్ష నేతలను కావాలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.

చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టినా అవి కేవలం కక్ష సాధింపు చర్యలే తప్ప నిరూపణ అయ్యేవి కాదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు..వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని మరో పక్క మెడకు చుట్టుకుంటున్న కేసులతో తీవ్ర ప్రస్టేషన్ కు గురై ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.