Minister KTR : ఏపీలో జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా : కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగళూరులో పనిచేసే ఐటీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అటువంటివారిని ఇక్కడికి వచ్చేలా తెలంగాణ ఐటీ అభివృద్ధి చెందుతోందన్నారు.

Minister KTR : ఏపీలో జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా  : కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR To Inaugurate Madikonda IT Tower

Madikonda IT tower..KTR :  ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పర్యటించారు. వరంగల్ లోని మడికొండలో ఐటీ టవర్ ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..తెలంగాణ ఐటీ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివద్ధి చెందుతోందని ఇంకా వరంగల్ ను అభివృద్ది చేయాలని అన్నారు. మరో 10ఏళ్లలో హైదరాబాద్ కు వరంగల్ కు తేడా తెలియనంతగా అభివద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఏపీలో కూడా ఐటీని డెవలప్ కు సహకరించండీ..జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా అంటూ మడికొండలోని ఐటీ పార్కులో క్వాడ్రెంట్‌ ఐటీ కంపెనీ నిర్వాహకులకు సూచించారు. ఏపీలోని భీమవరం, ఏలూరు ఎక్కడైనాసరే జగనన్నతో చెప్పి స్థలం ఇచ్చేలా ఏర్పాటు చేస్తాను అంటూ వ్యాఖ్యనించారు.  దీంతో అక్కడున్నవారంతా ఉత్సాహంగా నవ్వుతు కేకలు వేశారు.

హైదరాబాద్ కు వరంగల్ కు కేవలం 160కిలోమీటర్లు ఉందని కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చని.. బెంగళూరులో 40శాతం మంది తెలుగు రాష్ట్రాలవారు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని..వారంతా ఇక్కడకు వచ్చి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అటువంటివారిని ఇక్కడికి వచ్చేలా ఐటీ అభివృద్ధి చెందుతోందన్నారు.

వరంగల్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మడికొండలోని బంధం చెరువు వద్ద పలు అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్,బస్తీల్లో ఆస్పత్రులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు..పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.