స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ పేరుతో అతిపెద్ద జూ ప్రారంభించిన రిలయన్స్

గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో.. రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో 6 వందల ఎకరాల్లో విస్తరించి ఉంది స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్.

స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ పేరుతో అతిపెద్ద జూ ప్రారంభించిన రిలయన్స్

All You Need To Know About Vantara Animal Shelter Of Reliance

Vantara Animal Shelter Of Reliance: వంతార. ఇది దేశంలోనే అతిపెద్ద జంతు సంరక్షణశాల. మూగ జీవుల సంరక్షణకు రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించిన ఈ అతిపెద్ద జూలో ఉన్న వసతులు దేశంలో మరెక్కడా లేవు.. స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ వంతార జూను ప్రారంభించింది.. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో.. రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో 6 వందల ఎకరాల్లో విస్తరించి ఉంది.

2 వేల ఏనుగులు, 300 చిరుతపులులు
వంతార జూలోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్కు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడుతున్నారు. మన దేశంలో అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ.. ప్రస్తుతం ఇక్కడ 2వేలకు పైగా ఏనుగులు, 3వందలకు పైగా చిరుతపులులు, పులులు, సింహాలు, జాగ్వార్లు ఉన్నాయి. అలాగే.. 300కి పైగా జింకల లాంటి శాఖాహార జీవులు, 12వందలకు పైగా మొసళ్లు, పాములు, తాబేళ్లున్నాయి .

ఈ వంతార జూ ఏర్పాటులో భాగంగా ఎప్పటినుంచో జంతు సంరక్షణ చర్యలు చేపట్టింది రిలయన్స్ ఫౌండేషన్. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేశారు. వాటిని ఇప్పుడు వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూలో 100 జాతులకు పైగా ప్రాణులున్నాయి. అరుదైన జాతుల ప్రాణులను కూడా సంరక్షిస్తున్నారు.. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు.

అనంత్ అంబానీ ఆలోచన
ఈ జూ ఒక్కరోజుతో ఏర్పాటు అయింది కాదు. అనంత్ అంబానీ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన వంతార రూపు దాల్చడానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది. ఎప్పటి నుంచో జూ ఏర్పాటు చేయాలని ఉన్నా.. కరోనా సమయంలో వంతార గురించి ఆలోచించేందుకు ఎక్కువ సమయం దొరికిందని చెబుతున్నారు అనంత్ అంబానీ. జూలో సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందని అంటున్నారు. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని.. సేవాగుణంతో తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేరణతో స్టార్ట్ చేసిందని చెబుతున్నారు అనంత్ అంబానీ.

Also Read: గుడ్ న్యూస్.. రూ. 10వేల లోపు ధరలో కొత్త జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది!

కీలక జాతుల జీవులకు పునరావాసం
జంతు సంరక్షణ, సంక్షేమం కోసం ప్రముఖ నిపుణులతో కలిసి పనిచేస్తోంది వంతార. రక్షించిన ప్రాణి జాతులు వృద్ధి చెందడానికి సహజమైన, పచ్చని ఆవాసాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనియన్ వంటి.. ప్రకృతి పరిరక్షణ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగంగా వందలాది జంతువులను కాపాడారు. వేలాది ఇతర జంతువులు, పాములు, పక్షులు, ఖడ్గమృగం, చిరుతపులి, మొసలి వంటి కీలక జాతుల జీవులకు పునరావాసం కల్పిస్తోంది వంతార.

Also Read: ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ‘కృత్రిమ్ ఏఐ’.. మన భారత చాట్‌జీపీటీ ప్రత్యేకతలేంటో తెలుసా?

6 వందల ఎకరాల్లో కృత్రిమ అడవి
భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడంపైనే వంతార ఫోకస్ చేసింది. మెక్సికో, వెనిజులా మొదలైన దేశాలలో జరిగే అటవీ జంతువుల రెస్క్యూ మిషన్లలో కూడా వంతారా పాల్గొననుంది. వంతార అనేది ఒక కృత్రిమ అడవి. 6 వందల ఎకరాల్లో ఈ అడవిని నిర్మించారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు.భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి.

Also Read: ఆహా.. ఏమి రుచులు.. అంబానీ ఇంట పెళ్లంటే ఆ మాత్రం ఉంటుందిలే.. 2500 స్పెషల్ వంటకాలు!

అనంత్ అంబానీకి చిన్నతనం నుంచి జంతువులు అంటే చాలా ఇష్టం. వాటిని కాపాడటం మరింత ఇష్టం. అతని ఆలోచన, ఇష్టంతో రూపుదిద్దుకున్నదే ఈ వంతారా. దేశంలో అంతరించిపోతున్న జంతు జాతుల్ని రక్షించి ఆదర్శంగా నిలుస్తున్న ఈ రిలయన్స్ ఫౌండేషన్ మిషన్కు భారతదేశంతో పాటు.. అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది.