Kajal Aggarwal : ‘ఢీ’ షోలో శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి చందమామ కాజల్..
తాజాగా 'ఢీ' షో రేస్ టూ ఫినాలే ఎపిసోడ్ కి కాజల్ అగర్వాల్ గెస్ట్ గా వచ్చి సందడి చేసింది.
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఇప్పుడు సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ప్రస్తుతం కాజల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు డ్యాన్స్ షో ఢీ(Dhee) కి వచ్చింది. బుల్లితెరపై దాదాపు 17 సీజన్లుగా ఢీ షో అందర్నీ మెప్పిస్తునే ఉంది. ఎంతోమంది డ్యాన్సర్లు, డ్యాన్స్ మాస్టర్లు ఈ షో నుంచి వచ్చారు.
ప్రస్తుతం ఢీలో 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. తాజాగా రేస్ టూ ఫినాలే ఎపిసోడ్ కి కాజల్ అగర్వాల్ గెస్ట్ గా వచ్చి సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ రిలీజవ్వగా ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ప్రోమోలోనే హైపర్ ఆది, కాజల్ అగర్వాల్ల కామెడీతో సందడి చేశారు. అలాగే చివర్లో కాజల్ అగర్వాల్ శేఖర్ మాస్టర్తో(Sekhar Master) కలిసి బంతిపూల జానకి.. సాంగ్ కి స్టెప్పులు వేసి అలరించింది. బాద్షా సినిమాలో కూడా ఈ పాటని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో కాజల్ డ్యాన్స్ చేయడం గమనార్హం.
ఇక కాజల్ ఎపిసోడ్ లోని డ్యాన్సర్లు పర్ఫార్మెన్స్ ని చూసి అభినందించింది. ఇక ఫైనల్ ముందు జరిగే ఈ రేస్ టు ఫినాలే ఎపిసోడ్లో నాలుగు పర్ఫామెన్స్లు ఉంటాయి. ఆదర్శ్, శ్వేతనాయుడు, వర్షిణి అర్జ, రాకీ పర్ఫామెన్స్లు ఈ ఎపిసోడ్ లో ఉండగా ఈ ఎపిసోడ్ తరువాత ఒకరు ఎలిమినేట్ అయి ముగ్గురు మాత్రం ఫైనల్కి వెళ్లనున్నారు. ఇక ఢీ షో ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో వస్తుందని తెలిసిందే.