Harish Shankar : స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారన్న పవన్ వ్యాఖ్యలపై.. స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్..

తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.

Harish Shankar : స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారన్న పవన్ వ్యాఖ్యలపై.. స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్..

Harish Shankar Reacts on Pawan Kalyan Comments goes Viral

Harish Shankar : ఇటీవల పవన్ కళ్యాణ్ అటవీశాఖకు సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. గతంలో అడవులని కాపాడేవాళ్ళని హీరోలుగా చూపించేవాళ్ళు. కానీ ఇటీవల అడవులని స్మగ్లింగ్ చేసేవాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు. నేను సినిమాలకు చెందినవాడినే కానీ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇష్టం ఉండదు అని అన్నారు. దీంతో ఇటీవల పుష్ప సినిమాలో హీరో స్మగ్లింగ్ చేసే పాత్రలో కనిపించడంతో పలువురు ఈ వ్యాఖ్యలని ఆ సినిమాని ఉద్దేశించి అన్నారని కామెంట్స్ చేసారు.

అయితే తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆగస్టు 15న హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో తన సినిమాలోని హీరో చాలా నిజాయితీ పాత్ర అని చెప్పడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని మీడియా ప్రస్తావించింది. దీంతో హరీష్ శంకర్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయనకి మామూలుగానే సామాజిక బాధ్యత ఎక్కువ. ఇప్పుడు ఆయన అటవీశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక బాధ్యతతో ఒక రిఫరెన్స్ తీసుకొని అలా అని ఉంటారు. అయినా సినిమాల్లో చూపించినవి జనాలు చెయ్యరు. పుష్ప సినిమా చూసి ఎవరూ గొడ్డళ్లు పట్టుకొని అడవులకు వెళ్ళలేదు అని అన్నారు. దీంతో హరీష్ శంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : AAY : ఎన్టీఆర్ బామ్మర్ది కోసం హీరో నిఖిల్‌..

ఏదేమైనా అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ ఇష్యూ ఎన్నికల సమయం నుంచి ఫ్యాన్స్ సాగదీస్తున్నారు. ఇప్పుడు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పుష్ప సినిమానే అని ఉద్దేశించి అన్నారని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆయన ఎవర్ని ఉద్దేశించి అనలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు.