టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల గొప్ప మనసు.. వారికి లక్ష రూపాయల సాయం

తన మొదటి జీతం నుంచి లక్ష రూపాయల చెక్కును బాలిక బంధువులకు అందించారు ఎమ్మెల్యే బొలిశెట్టి దంపతులు.

టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల గొప్ప మనసు.. వారికి లక్ష రూపాయల సాయం

Tdp Janasena Mlas Humanity : టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు గొప్ప మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేశారు. తమ మొదటి జీతాన్ని ఆర్థిక సాయంగా అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. అగ్ని ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు అండగా నిలిచారు. బాలికకు ఆయన ఆర్థిక సాయం చేశారు.

తన మొదటి జీతం నుంచి లక్ష రూపాయల చెక్కును బాలిక బంధువులకు అందించారు ఎమ్మెల్యే బొలిశెట్టి దంపతులు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిక, ఆమె తల్లిదండ్రులు గాయపడ్డారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు మృతి చెందగా బాలిక ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దాతృత్వాన్ని అంతా అభినందిస్తున్నారు.

అటు సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన గొప్ప మనుసు చాటుకున్నారు. ఆయన మానవత్వం చూపించారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎమ్మెల్యే రాజు తన తొలి వేతనాన్ని (రూ.1.75 లక్షలు) విరాళంగా ఇచ్చారు. మడకశిర మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీటి కొళాయి వేసుకోవడానికి పన్ను చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ఆయన అండగా నిలిచారు. తన సొంత డబ్బుతో పన్నులు చెల్లించి ఇంటి వద్దే కొళాయిలు వేసుకోవడానికి ఎమ్మెల్యే రాజు తన తొలి వేతనాన్ని రూ.1. 75 లక్షలు విరాళంగా అందించారు. మున్సిపల్ కమిషనర్ చేతికి లక్షా 75 వేల రూపాయల చెక్ ను అందచేశారు ఎమ్మెల్యే రాజు దంపతులు. మా నీటి కష్టాలు చూసి మా దాహార్తిని తీర్చేలా తన జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే రాజు దంపతులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : పేదలకు అన్నం పెడితే పెత్తందారి ఎలా అవుతారు? 2019లో ఒక సైకోను తెచ్చుకున్నారు- సీఎం చంద్రబాబు