ఢిల్లీకి చంద్రబాబు.. శనివారం ప్రధాని మోదీతో సమావేశం

రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు.

ఢిల్లీకి చంద్రబాబు.. శనివారం ప్రధాని మోదీతో సమావేశం

Chandrababu Naidu (Photo Credit : Google)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి బయలుదేరారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకుని 7 గంటలకు జల మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు. ఇవాల రాత్రికి ఎంపీలతో విందు సమావేశం ఉంటుంది.

రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. రేపు రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరకముందు ఆయనతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడుల అంశంపై వారు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు.

Also Read: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుంది.. కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకేమో..: బండి సంజయ్