Janmashtami 2024 : దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. కృష్ణయ్యను ఏ పూలతో పూజించాలి

కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు పేర్కొంటున్నారు.

Janmashtami 2024 : దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. కృష్ణయ్యను ఏ పూలతో పూజించాలి

Krishna Janmashtami 2024

Janmashtami 2024 Puja Samagri : దేశ వ్యాప్తంగానేకాక, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి.. ఇంకా అష్టమి రోహిణి అనికూడా అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుని దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Also Read : Krishna Janmashtami 2024 : ఉట్టిలో ఏం వేస్తారు? ఉట్టి ఎందుకు కొడతారో మీకు తెలుసా?

విష్ణువుకు అత్యంత ఇష్టమైన అవతారాల్లో శ్రీకృష్ణుడు అవతారం ఒకటని చెబుతారు. చిన్నతనంలో తల్లి యశోద బాల గోపాలుడిని అందంగా ముస్తాబు చేసేది. ఇందులో నెమలి కిరీటం, నడుము పట్టీ, ప్రకాశవంతమైన బొట్టు, చెవిపోగులు, పసుపు కండువా.. ఇలా మొదలైన వస్తువులతో శ్రీకృష్ణుడు ప్రకాశవంతంగా మెరిసేవారు. భక్తులు జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఈ వస్తువులన్నీ సమర్పించాలి. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సులు లభిస్తాయని నమ్ముతారు. వైదిక క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఆగస్టు 25 ఆదివారం సాయంత్రం 6.09 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఆగస్టు 26వ తేదీ (సోమవారం) సాయంత్రం 4,49 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు చంద్రుడు వృషశరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01గంటల నుంచి 12.45గంటల వరకు ఉంటుంది. అంటే ఈ 45 నిమిషాల సమయంలో భక్తులు పూజ చేసుకోవడానికి అనువైన సమయం అని పండితులు పేర్కొంటున్నారు.

Also Read : అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు పేర్కొంటున్నారు.
పారిజాత పూలతో ఆరాధిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాల సర్పదోషాలను తొలగించుకోవచ్చు.
సంపగి పూలతో పూజిస్తే శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు.
మల్లెపూలతో ఆరాధిస్తే శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
తమ్మిపూలతో ఆరాధిస్తే కృష్ణుడి పట్ల భక్తి మరింత పెరుగుతుందట.
పద్మ పుష్పాలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారు.
గన్నేరు పుష్పాలతో పూజిస్తే వాక్చాతుర్యం పెరుగుతుంది.
నందివర్ధనం పుష్పాలతో పూజిస్తే సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయి.
తెల్లజిల్లేడు పూలతో ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి. ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది.
ప్రొద్దుతిరుగుడు పుష్పాలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.