AP CM Ys Jagan : దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా నిన్న ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఇద్దరు మంత్రులతో కలిసి స్పెషల్‌ ఫ్లైట్‌లో దావోస్‌ వెళ్లారు సీఎం జగన్‌.

AP CM Ys Jagan : దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్

Jagan Davos Tour

AP CM Ys Jagan :  ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా నిన్న ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఇద్దరు మంత్రులతో కలిసి స్పెషల్‌ ఫ్లైట్‌లో దావోస్‌ వెళ్లారు సీఎం జగన్‌.

ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జగన్ నేతృత్వంలోని బృందం హాజరు కానుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం జగన్‌ దావోస్‌ వెళ్లారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రపంచ నలుమూలల నుంచి 2 వేల 200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థిక వేత్తలు సదస్సుకు హాజరవనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకోనుంది.

దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాల్లో భాగస్వామ్యం కానున్నారు. 23న వైద్యరంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. 24న డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొననున్నారు. ప్రజలు, పురోగతి, అవకాశాలు.. అనే నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సీఎం అయిన మూడేళ్ల తర్వాత తొలిసారి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎలాంటి సంస్థలను తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

గన్నవరం నుంచి వెళ్లిన సీఎం జగన్ నేరుగా నిన్న సాయంత్రం 6 గంటలకు జ్యూరిచ్ చేరుకున్నారు. రాత్రి 8.30 గంట‌ల‌కు దావోస్‌ చేరుకుంది సీఎం బృందం. 10 రోజుల పాటు జగన్‌ బృందం విదేశీ ప‌ర్యట‌న‌లోనే ఉండ‌నున్నారు. ఈనెల 31న సీఎం తిరిగి ఏపీకి చేరుకునే అవకాశముంది. సీఎం జగన్ వెంట ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డితో పాటు.. స్పెషల్ సీఎస్‌లు కరికాల వలవన్, జవహర్‌రెడ్డి, ఎస్ఎస్ రావత్, సుబ్రహ్మణ్యం ఆర్ధిక, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

Also Read : Telangana Rains : తెలంగాణాలో మరో 3 రోజుల పాటు వర్షాలు