Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఆయన తప్పుబట్టారు.

Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..తమను ఘోరంగా అవమానిస్తున్నారని, గత రెండున్నరేళ్లుగా బండబూతులు తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెక్కివెక్కి ఏడ్చారు. కొద్దిసేపటి అనంతరం ఆయన మళ్లీ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అన్ని విధాల అవమానిస్తోంది.. వ్యక్తిగత విమర్శలు చేశారు..ఎన్నో అవమానాలు భరించామన్నారు. చివరకు తన భార్యను కూడా అవమానిస్తున్నారని, నా భార్య కూడా ఎంతో సహకరించిందని తెలిపారు.
Read More : Chandrababu: సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా!
తన భార్యకు ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి లేదని, తమ పార్టీ నేతల్లో చాలా మంది నా భార్యకు తెలియదన్నారు. నా భార్య త్యాగం..నా పోరాటం అంతా ప్రజల కోసమేనన్నారు. అయితే..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ప్రతిపక్షాన్ని అవమానిస్తోందని, ప్రతిపక్ష నేతనన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ కూడా వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టడం లేదన్నారు.
Read More : Heavy Rains in Tirupaty: తిరుచానూరులో కుప్పకూలిన ఇల్లు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశంలో అధికారపక్షం, విపక్ష సభ్యుల మధ్య మాటలతూటాలు పేలాయి. ఈ సందర్భంగా బాబు సభలో జరిగిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే..సభలో అడుగుపెడుతానని శపథం చేసి వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టారు.
Read More : AP Heavy Rains: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు.. టాప్ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు..
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో…తాను ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదని, నాకు పదవులు అవసరం లేదన్నారు. దీనికన్న పెద్ద రికార్డులు లేవని చెప్పారు. తన రికార్డులు బద్దలు కొట్టడానికి చాలా సమయం పడుతుందని అధికారపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం కోసం 40 ఏళ్లుగా పనిచేయడం జరిగినట్లు చెప్పారు. అనేక మంది నాయకులతో తాను పని చేయడం జరిగిందని, ఎన్నికల్లో గెలిచాం..ఓడిపోయామన్నారు. తమ వ్యక్తిత్వాలను కించపరిచేలా వైసీపీ ప్రవర్తించిందని, ఓడినప్పుడు కుంగిపోలేదు..గెలిచినప్పుడు రెచ్చిపోలేదన్నారు. వాజ్ పేయి గతంలో ప్రధానిగా ఉన్న సమయంలో తనను మంత్రి పదవిలో చేరాలని అనడం జరిగిందని, కానీ..తమ రాష్ట్రానికి పనులు చేయాలని సున్నితంగా తిరస్కరించినట్లు ఆనాటి విషయాలను వెల్లడించారు.
- TDP mahanadu: నేటి నుండి టీడీపీ మహానాడు.. పసుపు మయంగా మారిన ఒంగోలు..
- చంద్రబాబు, పవన్ వల్లే అలజడులు..!
- Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
- వైసీపీది ఐరన్ లెగ్ పాలన!
- AP Politics : ‘YCP ట్రాప్ లో పడొద్దు..టీడీపీతో పొత్తే బెటర్’అంటూ జనసేనానికి హరిరామజోగయ్య లెటర్
1PM KISAN: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. 31న రైతుల ఖాతాల్లోకి నగదు?
2Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
3Thirumala : తిరుమలలో మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు
4Punjab govt: వీఐపీలకు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేషన్లకు రానున్న 400మంది పోలీసులు..
5Conjuring House: రూ.12 కోట్లకు అమ్ముడు పోయిన దెయ్యాల ఇల్లు.. ఆ సినిమా చూస్తే అసలు విషయం తెలుస్తుంది
6TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
7Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్
8Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్లతో జాగ్రత్త
9Telangana Covid Report Latest : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
10NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
-
Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
-
Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
-
Salaar: పూర్తి యాక్షన్ మోడ్లోకి వెళ్లిన సలార్
-
Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
-
Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?