Illicit Liquor Deaths : అవన్నీ బాబు బ్రాండ్లే! అవే అమ్ముతున్నాం

20 డిస్టిలరీలకు అనుమతి ఎప్పుడు వచ్చిందో గమనించాలన్నారు. రాష్ట్రంలో లిక్కర్ లు తయారు చేసే 20 డిస్ట్రిలరీ ఉన్నాయని, 1982 కంటే ముందు.. కేవలం ఐదు మాత్రమే

Illicit Liquor Deaths : అవన్నీ బాబు బ్రాండ్లే! అవే అమ్ముతున్నాం

Cm Jagan

CM Jagan : ఏపీలో గత కొన్ని రోజులుగా మద్యం విషయంలో టీడీపీ చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీ దానికి అనుమతినివ్వలేదని, మొత్తం బాబు హయాంలో ఉన్నవేనన్నారు. మహిళా వ్యతిరేక పార్టీ…మహిళా వ్యతిరేక నాయకుడు.. చేస్తున్న చీఫ్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి విషయం సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందన్నారు. 2019 తర్వాత.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఒక్క డిస్టిలరీ అనుమతి ఇచ్చిందే లేదన్నారు. 2022, మార్చి 23వ తేదీ బుధవారం అసెంబ్లీలో మద్యం విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బాబు హయాంలో మొత్తంగా 254 బ్రాండ్లను తీసుకొచ్చారని ఆ బ్రాండ్ల పేర్లను తెర మీద చూపించారు.

Read More : అసెంబ్లీ‌లో ఎమోషనల్ అయిన స్పీకర్ తమ్మినేని

20 డిస్టిలరీలకు అనుమతి ఎప్పుడు వచ్చిందో గమనించాలన్నారు. రాష్ట్రంలో లిక్కర్ లు తయారు చేసే 20 డిస్టిలరీ ఉన్నాయని, 1982 కంటే ముందు.. కేవలం ఐదు మాత్రమే ఉన్నాయన్నారు. 1982 తర్వాత.. డిస్టిలరీ సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు. బాబు హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతులు వచ్చాయని, 2014-19 సంవత్సర మధ్య కాలంలో ఏడు డిస్టిలరీలను అనుమతి ఇచ్చారన్నారు. నారా బదులు సారా అంటే కరెక్టుగా ఉంటుందోమోనని ఎద్దేవా చేశారు. లిక్కర్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని, నేషనల్ స్టాండర్డ్ విధానాలను పాటిస్తూ..లిక్కర్ తయారు చేస్తాయన్నారు. వేల బాటిల్స్ ను కంపెనీ నుంచి బయటకు ఇచ్చే సమయంలో ఆయా యాజమాన్యాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాయని, ఇదే సమయంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ టెస్టులు చేయడం జరుగుతుందన్నారు. లెసెన్స్ డ్ డిస్టిలరీ ద్వారానే ప్రమాణాల మేరకు మద్యం తయారవుతుందన్నారు. డిస్టిలరీల ద్వారా మద్యం ప్రమాణాల మేరకు తయారవుతుంది కాబట్టి తక్కువ ప్రమాదకరమని, నాటు సారా చాలా ప్రమాదకరమన్నారు.

Read More  : Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరి: ఉమ్మడిగా వ్యతిరేకించిన టీడీపీ, వైసీపీ

ఎవరి పాలనలోనైనా బ్రాండ్ల మద్యం తయారీకి ఒకే ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా టీడీపీ సరికొత్త నాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ ద్వారా డబ్బులు రాకూడదు.. ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారనే దిక్కు మాలిన ఆలోచనలు చేస్తారని విమర్శించారు. ఈ విషయంలో ఎస్జీఎస్ ల్యాబ్ ను తమ ప్రభుత్వం సంప్రదించడం జరిగిందని.. ఇందుకు వారు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు. ఈ ల్యాబ్స్ లో ఇచ్చిన శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదని, అవే లైసెన్స్ డిస్టిలరీస్ నుంచి అవే లిక్కర్.. అవే ప్రాసెస్ నుంచి వస్తే.. బాబు హయంలో లిక్కర్ దాగితే హెల్త్.. తమ ప్రభుత్వంలో తాగితే విషమని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మద్యానికి సంబంధించిన బ్రాండ్లను ఆయన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చివరి నిమిషంలో (ఏప్రిల్ – మే నెలలో) కొత్త కొత్త రకాల లిక్కర్ లకు అనుమతినిచ్చారని విమర్శించారు. మొత్తంగా చీప్ లిక్కర్ అనేది రాష్ట్రంలో లేదని స్పష్టం చేశారు. భూంభూం, గవర్నర్ చాయిస్, పవర్ స్టార్999, రష్యన్ రోమనోవాలు బాబు బ్రాండ్లేనని విమర్శించారు. డిస్టలరీలు, బ్రీవరీల్లో ఎక్కువగా టీడీపీ నేతలవేనని, క్రేజీడాల్, 999 లెజెండ్ విస్కీ, రాయల్ ప్యాలెస్ బాబు హయాంలో వచ్చాయన్నారు సీఎం జగన్.