High Court: ఉద్యోగస్తుల నుంచి రికవరీ చేయొద్దు.. పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం చినికి చినికి గాలివానలా మారింది.

High Court: ఉద్యోగస్తుల నుంచి రికవరీ చేయొద్దు.. పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

High Court

High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం చినికి చినికి గాలివానలా మారిన క్రమంలో పీఆర్సీని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.

కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు జీతాలు నుంచి ఎటువంటి రికవరీలు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. పీఆర్సీ కొత్త జీవోలను మూడు వారాల పాటు యధాస్థితిలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన పీఆర్సీ వలన తమకు అన్యాయం జరుగుతుందనేది పిటిషనర్ కృష్ణయ్య చెబుతున్నారు. జీతాలు, అలివెన్సుల్లో లో తగ్గుదల కనిపించిందని వ్యాఖ్యానించిన హైకోర్టు. పీఆర్సీ జీవోలపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.