స్టీఫెన్ సన్ ను చంద్రబాబు ప్రలోభపెట్టినట్లు ఒప్పుకున్న మత్తయ్య…ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

స్టీఫెన్ సన్ ను చంద్రబాబు ప్రలోభపెట్టినట్లు ఒప్పుకున్న మత్తయ్య…ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

ED investigation of the note for vote case : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు… నిందితుడు జెరూసలేం మత్తయ్య ఈడీ విచారణలో అంగీకరించారు. మత్తయ్య వాగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసింది. చంద్రబాబు డైరెక్టన్‌లోనే రేవంత్‌ రెడ్డితో కలిసి…స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టినట్టు… మత్తయ్య ఒప్పుకున్నాడు.

స్టీఫెన్ సన్… టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడం కోసం.. డీల్ మాట్లాడినట్టు… మత్తయ్య ఈడీ విచారణలో అంగీకరించాడు. సెబాస్టియన్ ను సంప్రదించి డీల్ ఓకే చేసినట్టు చెప్పాడు. టీడీపీకి ఓటు వేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని… ఎన్నికల నుంచి తప్పుకుంటే 3 కోట్లు ఇస్తామని డీల్ మాట్లాడినట్టు మత్తయ్య ఒప్పుకున్నాడు.

డీల్ సెట్ చేసినందుకు 50 లక్షలు ఆఫర్ ఇచ్చారని మత్తయ్య అంగీకరించారు. లోకేశ్‌ సలహా మేరకు ఏపీకి వెళ్లానని ఈడీకి మత్తయ్య తెలిపారు. ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.