Bhubaneswar Express: ఏపీలో భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

ఏపీలోని నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. వేదాయపాలెం వద్ద భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు.

Bhubaneswar Express: ఏపీలో భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

Bhubaneswar Express: ఆంధ్ర ప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. నెల్లూరు జిల్లా, వేదాయపాలెం వద్ద భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-3 బోగీలో మంటలు అంటుకున్నాయి.

Payyavula Keshav: త్వరలో నారా లోకేష్ పాదయాత్ర: పయ్యావుల కేశవ్

ఈ బోగీలోని మంటలతో ఏర్పడ్డ పొగలు పక్క బోగీల్లోనూ దట్టంగా అలుముకున్నాయి. ఉన్నట్టుండి మంటలు, పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ప్రయాణికులు రైలు నుంచి బయటకు దిగారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

Kuno National Park: చీతాల రాకపై స్థానికుల్లో ఆందోళన.. తమ ఊళ్లు ఏమవుతాయోనని భయపడుతున్న ప్రజలు

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.