Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

వైఎస్సార్ కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని వెల్లడించారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను పొగిడితే జగన్ కు నచ్చదన్నారు.

Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

Gone Prakash

Gone Prakash : ఏపీ సీఎం జగన్ పై గోనే ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతి కోసమే షర్మిళ, విజయమ్మను జగన్ దూరంగా పెట్టారని అన్నారు. తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహమని పేర్కొన్నారు. షర్మిళ పోలీసులను కొట్టారని తాను ఓ వీడియోలో చూశానని చెప్పారు. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. షర్మిళ.. తన కూతురు లెక్క.. తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడనని చెప్పారు.

షర్మిళ రోడ్డెక్కడానికి కారణం ఎవరు..? జగన్ కాదా..? అని ప్రశ్నించారు. ఆమె పక్క రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్నారు. జగన్ షర్మిళను చిత్రహింసలు పెడుతున్నారని విమర్శించారు. ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిళను కలిశారు.. ఆమెకు సాయం కింద రూ. 5 కోట్లు ఇస్తామన్నారని ఆరోపించారు. ఆ ఎంపీ షర్మిళ వద్దకు వెళ్లిన విషయం తెలుసుకుని స్వయంగా సీఎం జగన్ ఆయనకు ఫోన్ చేసి, ఎందుకెళ్లావ్..? సాయం చేయాల్సిన అవసరం ఏముందని బెదిరించారని ఆరోపించారు.

Gone Prakash Rao : గోనె ప్రకాష్‌‌రావు‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం

షర్మిళ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారని పేర్కొన్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిళపై ఎందుకంత కోపం అని నిలదీశారు. షర్మిళ ఇక్కడ పార్టీ పెడితే జగన్ పరిస్థితి ఏమవుతుంది? అన్నారు. షర్మిళ తన కూతురు లెక్కే కానీ, జగన్ కొడుకు లెక్క కాదన్నారు. వైఎస్సార్ ఏడు కొండలు మింగేస్తారని తిట్టిన దాడి వీరభద్రరావును పార్టీలోకి తెచ్చుకున్నారని విమర్శించారు.

వైఎస్సార్ కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని వెల్లడించారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను పొగిడితే జగన్ కు నచ్చదన్నారు. విజయమ్మ కంట నీరు పెట్టుకునేలా మాట్లాడిన బొత్స ఇప్పుడు కిచెన్ క్యాబినెట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. విజయమ్మను రాజ్యసభకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా..? లేదా..? అని అడిగితే.. నీలం సంజీవరెడ్డిని కులం అడిగినట్లుగా ఉందన్నారు.

Andhra Pradesh : కుప్పంలో దిష్టిబొమ్మల రాద్దాంతం .. కిందపడిపోయిన సీఐ

వైఎస్ వివేకా హత్యలో అవివాష్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. చాలా మంది పెద్ద వాళ్లు, కేంద్ర మాజీ మంత్రులు, మాజీ సీఎంలు, మాజీ మంత్రులు జైళ్లకు వెళ్తారని పేర్కొన్నారు. వీరి కంటే అవినాష్ రెడ్డి గొప్పేం కాదన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే 151 సీట్లు దాటుతాయని, విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయని చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు.

కొందరు విశ్లేషకులు డబ్బులు తీసుకుని చెబుతున్నారని విమర్శించారు. ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లు.. మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. సంక్షేమం ఎన్టీఆర్ తోనే మొదలైందని కానీ, ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పొడా..? అని ప్రశ్నించారు. సంక్షేమ నిధులు జగన్ తన జేబుల్లో నుంచి ఇస్తున్నారా..? అని నిలదీశారు.