Heavy Security : విశాఖతో పాటుగా పలు రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు.

Heavy Security : విశాఖతో పాటుగా పలు రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

Waltair (1)

Heavy security : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింసతో వాల్తేర్ రైల్వే డివిజన్ అప్రమత్తం అయింది. వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖతో పాటుగా పలు స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. స్టేషన్లు, రైల్వే కాలనీల్లో భద్రతా దళాలతో నిరంతరం నిఘా ఉంచారు. రైల్వే స్టేషన్లలో అనౌన్స్ మెంట్లు ఏర్పాటు చేశారు. యువత, విద్యార్థులు, ప్రయాణీకులు శాంతి పాటించాలని హితవు పలుకుతూ అనౌన్స్ మెంట్ లు చేస్తున్నారు. వాల్తేర్ పరిధిలోని పరిస్థితిపై డీఆర్ ఎమ్ అనుప్ కుమార్ సత్పతి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలకు శాంతి భద్రతలపై వాల్తేరు రైల్వే ఎప్పటికప్పుడు సమాచారం చేర వేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేక ఆందోళన తెలంగాణకు పాకింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Nampally Railway Station : సికింద్రాబాద్ లో విధ్వంసం..నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత

శుక్రవారం ఉదయం ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌లోకి దూసుకొచ్చిన కొందరు యువకులు పలు రైళ్లకు నిప్పు పెట్టి దహనం చేశారు. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనమయ్యాయి. రైల్వే స్టేషన్‌కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ‘సేవ్ ఆర్మీ’ అంటూ నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్‌లోని షాపులు, సీసీ కెమెరాలు, ఫర్నీచర్, అద్దాలు సహా అనేక ఆస్తులను ధ్వంసం చేశారు. రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు. పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు.

రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు స్టేషన్‪లోని ప్రయాణికులను పోలీసులు బయటకు పంపేశారు. సికింద్రాబాద్ రావాల్సిన, వెళ్లాల్సిన రైళ్లను అధికారులు రద్దు చేశారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని యువకులు అంటున్నారు.