AP Employees HRA : బ్రేకింగ్ న్యూస్, ఏపీ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు

శనివారం ఆర్థిక శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ ఓడీ ఉద్యోగులకు వర్తింపు చేయనున్నారు.

AP Employees HRA : బ్రేకింగ్ న్యూస్, ఏపీ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు

Ap Prc

HRA Payment Changes In AP : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు జరిగాయి. విజయవాడ సమీపంలోని హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచేందుకు ఏపీ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ ఓడీ అధికారుల సిఫార్సులతో హెచ్ఆర్ఏలను సవరించింది. ఈ మేరకు 2022, జనవరి 29వ తేదీ శనివారం ఆర్థిక శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ ఓడీ ఉద్యోగులకు వర్తింపు చేయనున్నారు.

Read More : AP PRC Fight : ఏపీలో జీతాలపై సందిగ్ధత.. అధికారులపై క్రమశిక్షణా చర్యలు

గత కొన్ని రోజులుగా ఏపీ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఇచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ..సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో…ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఒక కదలిక వచ్చిందని చెప్పవచ్చు. వారి ఆందోళనలు ఉధృతం కావడంతో హెచ్ఆర్ఏ విషయంలో మార్పులు చేయాలని భావించింది. కేవలం హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మిగిలిన వారి విషయంలో స్పందించడం లేదనే మరిన్ని విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. మంగళగిరి, ఇబ్రహీంపట్నంలో హెచ్ఓడీ కార్యాలయాలున్నాయని, ఇందులో వందలాది మంది పనిచేస్తున్నారని గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు కృష్ణయ్య వెల్లడించారు. తాము అడుగుతున్నది 16 శాతం కాదని..30 శాతం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. 2016లో తాము ఏపీకి రావడం జరిగిందన్నారు.

Read More : AP PRC : ఎస్మాకి భయపడేది లేదు, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతాం- ఏపీ జేఏసీ

మరోవైపు…వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయని అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ఆర్ధిక శాఖ రెడీ అయిపోయింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీఓలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ట్రెజరీస్ డైరెక్టర్ కు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.