జగన్ దోచుకున్న లక్ష కోట్లు ఇస్తే ఏపీ కష్టాలు తీరతాయి : కేఏ పాల్
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరతాయని చెప్పారు. ఇప్పటికే ఏపీ కోసం తన జీవితం ఇచ్చేశానని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, జగన్ తనతో చర్చకు రావాలని పాల్ సవాల్ విసిరారు. తాను రాజకీయం కొత్తగా మొదలు పెట్టలేదని పాల్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన శిష్యుడని, మిత్రుడని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు 175 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
ఫిబ్రవరి చివరి వారంలో మీటింగ్లు పెడుతున్నామని పాల్ చెప్పారు. ఫిబ్రవరి 21లోపు 10వేల మందిని పార్టీలో చేర్చితే టికెట్ ఇస్తామన్నారు. రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ అవినీతిని బయటపెడతామన్నారు. జగన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పాల్ ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలను జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు.