AP Grama Ward Sachivalayam : టైమ్‌కి రావాల్సిందే, ఆ పరిధిలోనే నివాసం ఉండాలి.. సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు

ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో పెను మార్పులు జరగనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం... కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

AP Grama Ward Sachivalayam : టైమ్‌కి రావాల్సిందే, ఆ పరిధిలోనే నివాసం ఉండాలి.. సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు

Ap Grama Ward Sachivalayam

AP Grama Ward Sachivalayam : ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి పెను మార్పులు జరగనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం… కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇకపై ఉద్యోగులంతా సమయానికి విధులకు హాజరు కావాల్సిందే అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఇప్పటి వరకు అవలంభించిన రిజిస్టర్ సంతకం విధానానికి స్వస్తి పలికింది. రేపటి నుంచి అన్ని సచివాలయాల్లో బయో మెట్రికి విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి ఉద్యోగి ఆఫీసుకొచ్చి, వెళ్లే సమయాల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ లో నమోదు చేయాల్సిందే. అలాగే ఇకపై ప్రతి ఉద్యోగి కూడా వారి వారి సచివాలయం పరిధిలోనే నివసించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వారు ఎక్కడ ఉండేది… పంచాయతీ అధికారికి తెలియజేయాలని… అలాగే.. సచివాలయ ఉద్యోగి పూర్తి చిరునామా, వివరాలను అయా కార్యాలయాల్లో అందరికీ అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది. ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కూడా ఆయా జిల్లాల వారీగా ఆదేశాలు జారీ చేసింది పంచాయతీ రాజ్ శాఖ. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్నా… సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించకున్నా సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో సూచించింది.

రేపటి నుంచి ప్రతి సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ కూడా వారి వారి పరిధిలోని సచివాలయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలని ఆదేశించింది. ఎక్కడైనా సాంకేతిక లోపం వస్తే… వెంటనే సంబంధిత అధికారికి చెప్పాలంది. జూలై నెల జీతం బయోమెట్రిక్ తో లింక్ అయి వస్తుందని.. ఎన్నిరోజులు హాజరుంటే అన్ని రోజులకే జీతం అందుతుందన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి ఎల్ఎంఎస్ ద్వారా ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం CBAS మార్కులను అనుసంధానం చేస్తామన్నారు. వ్యవస్థ ప్రారంభించి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ నుంచి సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ లోకి రానున్నారు.