Lagadapati Rajagopal : పొలిటికల్ రీఎంట్రీపై లగడపాటి ఏమన్నారంటే?

ఎమ్మెల్యే వసంత కృష్ణను వివాహ వేడుకలో కలిశానని చెప్పారు. అయితే ఆయనతో రాజకీయాలు మాట్లాడ లేదన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారిలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చారో అడిగానని చెప్పారు.

Lagadapati Rajagopal : పొలిటికల్ రీఎంట్రీపై లగడపాటి ఏమన్నారంటే?

Lagadapati

Lagadapati Rajagopal : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెర మీదకు వచ్చారు. ఆయన పొలిటికల్ రీఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన భేటీ అయ్యారు. పొలిటికల్ రీ ఎంట్రీపై లగడపాటి స్పందించారు.

తాను రాజకీయాలు చేసేందుకు రాలేదన్నారు. గరిడేపల్లిలో వివాహానికి హాజరయ్యానని తెలిపారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణను వివాహ వేడుకలో కలిశానని చెప్పారు. అయితే ఆయనతో రాజకీయాలు మాట్లాడ లేదన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారిలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చారో అడిగానని చెప్పారు. ఆయనతో ప్రత్యక్ష రాజకీయాలపై మాట్లాడలేదని తెలిపారు.

Lagadapati Rajagopal : మళ్లీ రాజకీయాలలోకి లగడపాటి ?

శనివారం నందిగామలో ఓ కార్యక్రమానికి హాజరైన లగడపాటి రాజగోపాల్.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో సమావేశం అయ్యారు. అక్కడ వారిద్దరు కలిసి లంచ్ చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న పలువురు నేతలు, సీనియర్ రాజకీయ నేతలు పార్టీలకతీతంగా లగడపాటితో సమావేశం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన రాజగోపాల్, తాను నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వడంతో రాజకీయ సన్యాసం తీసుకున్నారు.

గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రాజగోపాల్.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే 2024 నాటి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. వసంత కృష్ణ ప్రసాద్ తర్వాత పలువురు నేతలు ఆయనతో సమావేశం అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.