Vellampalli: చంద్రబాబు చెప్పినట్టు రాధా చేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

వంగవీటి రాధాను చంద్రబాబు కలవడం, రాధా రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం స్పందించారు

Vellampalli: చంద్రబాబు చెప్పినట్టు రాధా చేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

Radha

విజయవాడ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. శనివారం వంగవీటి రాధాను చంద్రబాబు కలవడం అంతటా ఆసక్తి రేకెత్తించగా.. వీరి భేటీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వంగవీటి రాధాను చంద్రబాబు కలవడం, రాధా రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం స్పందించారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాధాపై రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మెయిన్ రోడ్డులో రాధా ఇల్లు ఉంది, అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుద్దా? రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేశారా? అంటూ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చెప్పినట్టు రాధా చేస్తున్నారనే అనుమానం కలుగుతుందని.. చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో రాధా ప్రయాణం చేయకూడదని వెల్లంపల్లి అన్నారు. టీడీపీ హయాంలో వంగవీటి రంగా ఎందుకు దీక్ష చేశారో ఆయన కుమారుడు రాధా తెలుసుకోవాలని.. టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.

Also Read: Tamil Nadu : శివకాశి మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా – సీఎం స్టాలిన్

రాధాకు చంద్రబాబు పరామర్శ అనేది.. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉందన్నారు మంత్రి వెల్లంపల్లి. రాధా రెక్కీ అంశంపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. రాధా భద్రత కొరకు గన్ మేన్‌లను పంపించిన విషయాన్నీ గుర్తుచేశారు. రాధా మా పార్టీకి సంబంధం లేని వ్యక్తయినా సీఎం జగన్ గన్ మేన్లను కేటాయిస్తే.. వారిని వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా? అంటూ వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రాధాతో చంద్రబాబు డ్రామా చేయిస్తున్నాడని.. రాజకీయాల్లో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి వెల్లంపల్లి ఫైరయ్యారు.

Also Read: Vizianagaram : బొత్స దంపతుల కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్