నాగబాబు కొత్త డిమాండ్: గుడులు వారి చేతుల్లోనే ఉండాలి

  • Published By: vamsi ,Published On : June 6, 2020 / 06:20 AM IST
నాగబాబు కొత్త డిమాండ్: గుడులు వారి చేతుల్లోనే ఉండాలి

హిందూ దేవాలయాలు ప్రభుత్వం అధీనంలో ఉండకూడదంటూ బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ అన్నారని జనసేన నేత నాగబాబు చెప్పుకొచ్చారు. ఓ న్యూస్‌ ఛానెల్‌లో ఆయన మాట్లాడిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసిన నాగబాబు.. అన్నీ హిందూ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వంతో సంబంధంలేని వారి చేతుల్లోనే ఉండాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు.. ‘జీవితాల్ని హిందు ధర్మం కోసం త్యాగం చేసిన చాగంటి కోటేశ్వర రావు గారు, గరికపాటి నరసింహ రావు గారు, గీత గంగాధర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఇంకా ఎందరో గొప్ప వ్యక్తుల్ని హిందు దేవాలయాలను నిర్వహించే స్థానంలో చూడాలని ఉంది’ అని నాగబాబు ట్వీట్లు చేశారు.

ప్రార్థనా ఆలయాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదంటూ ఆయన డిమాండ్ చేశారు. 

Read: కరోనాతో బాలివుడ్ నిర్మాత అనీల్ సూరి మృతి