Omicron Tension : దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్‌ పోటీల్లో ఒమిక్రాన్‌ కలవరం

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కలవరపెడుతుండగా ఏపీలోనూ టెన్షన్‌ పుట్టిస్తోంది. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్‌ పోటీలు జరుగుతుండగా 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

Omicron Tension : దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్‌ పోటీల్లో ఒమిక్రాన్‌ కలవరం

Visakha

India skill competitions : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కలవరపెడుతుండగా.. ఏపీలోనూ టెన్షన్‌ పుట్టిస్తోంది. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్‌ పోటీలు జరుగుతుండగా.. ఐదు రాష్ట్రాలకు చెందిన 8వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అయితే ఇందులో ఆరుగురుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 50 మందికి కరోనా లక్షణాలు ఉండటంలో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

మరోవైపు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఏపీ వైద్యఆరోగ్య శాఖ ఖండించింది. ఈ మధ్యకాలంలో విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు విదేశాల నుంచి 30 మంది ప్రయాణికులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చింది.

Omicron : గుడ్ న్యూస్.. ఇప్పటివరకు ఒమిక్రాన్‌తో ఒక్కరు కూడా చనిపోలేదు

30 మంది విదేశీ ప్రయాణికులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్ తెలిపింది. కోవిడ్ నిబంధనల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.