PM Modi – CM Jagan: కొవిడ్ నివారణ చర్యలపై జగన్ తో మోదీ వీడియో కాన్ఫరెన్స్

విడ్ నివారణ విషయంలో సీఎంలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోని పరిస్థితులు, వైరస్ నివారణ చర్యల గురించి ప్రధాని మోదీతో ప్రస్తావించారు.

PM Modi – CM Jagan: కొవిడ్ నివారణ చర్యలపై జగన్ తో మోదీ వీడియో కాన్ఫరెన్స్

Pm Modi Cm Jagan

PM Modi – CM Jagan: కొవిడ్ నివారణ విషయంలో సీఎంలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోని పరిస్థితులు, వైరస్ నివారణ చర్యల గురించి ప్రధాని మోదీతో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న సేవలు, చేయాలనుకుంటున్న పనుల గురించి వెల్లడించారు.

కోవిడ్‌ నివారణ కోసం రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. అయినప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనపరిచాం. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి.

ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేశాం. ఇలా చేయడం వల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకున్నాం. వ్యాక్సినేషన్‌ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారం. కోటి 68లక్షల 46వేల 210 వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రైవేట్ సంస్థల ద్వారా వేసిన వ్యాక్సినేషన్ తో కలిపి కోటి 76లక్షల 70వేల 642 మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం.

వ్యాక్సినేషన్‌లో విధానాల వల్ల ఇచ్చిన దానికంటే ఎక్కువ మందికి వేయగలిగాం. జులై నెలలో 53లక్షల 14వేల 740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. జులై నెలలో ప్రైవేటు హాస్పిటల్స్ కు 17లక్షల 71వేల 580 వ్యాక్సిన్లను కేటాయించారు. క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. జూన్‌ నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4లక్షల 20వేల 209 మాత్రమే.

ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా పోయిన స్టాక్ కేటాయింపును తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది. కోవిడ్‌నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతాం.’ అని హామీ ఇచ్చారు ఏపీ సీఎం.