Reliance Jio 4G: రిలయన్స్ జియో 4G సేవలు.. ఎంపీ అవినాష్ చేతుల మీదుగా ప్రారంభం
రిలయన్స్ జియో తన 4G మొబైల్ నెట్వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారిపల్లిలో ప్రారంభించింది.

Reliance Jio 4G: రిలయన్స్ జియో తన 4G మొబైల్ నెట్వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారిపల్లిలో ప్రారంభించింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన జియో సెల్ టవర్ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు జియో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వేంపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన గిడ్డంగివారి పల్లి చుట్టూ కొండలు ఉండటంతో ప్రజలు సరైన మౌలిక సదుపాయాలు, టెలికాం నెట్వర్క్ లేక ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న అనేక సంక్షేమ పథకాలను పొందడంలో ప్రజలు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడప ఎంపీ చొరవ చూపి సెల్ టవర్ ఏర్పాటుకు కృషి చేశారు.
ఎంపీ సూచన మేరకు జియో త్వరితగతిన సెల్ టవర్ పనులు పూర్తి చేసి గ్రామంలో హైస్పీడ్ 4G మొబైల్ నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. కొత్త సెల్ టవర్ ద్వారా జియో గ్రామ ప్రజలకు హై-స్పీడ్ 4G సేవలు అందిస్తోంది. ఫలితంగా విద్యార్థులు కూడా ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళకుండా చదువుకోవచ్చునని చెబుతున్నారు.
కరోనా కాలంలో ప్రజలు షాపింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, పాఠాలను నేర్చుకోవడం, వినోదం పొందడం, ఆర్థికంగా లావాదేవీలు చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ పరివర్తన కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ మార్కెట్లకు కూడా విస్తరించింది.
గతంలో 3G సేవలు ఎక్కువగా పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు 4G హైస్పీడ్ సేవలను కొన్ని వందల మంది జనాభా కలిగిన గ్రామాల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నాయి.
దేశంతో పాటు మన రాష్ట్రం లో కూడా అతి పెద్ద 4G సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో తన విస్తృతమైన నెట్వర్క్ను అందుబాటు ధరలో జియోఫోన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని కస్టమర్లు సైతం ఈ సేవలు, వాటి ప్రయోజనాలను పొందుతున్నారు.
- Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు
- ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
- PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
- Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
- Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
1Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు
2Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
3Major : ఆర్మీ గురించి చదివాను.. ఈ సినిమా టైంలో కళ్ళతో చూశాను.. అడివి శేష్ మేజర్ మూవీ ఇంటర్వ్యూ..
4Viral video: అయ్యో పాపం.. ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ ఏం చేశాడంటే..
5Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
6PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్షిప్ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
7Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
8YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
9UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
10Kedarnath: కేదార్నాథ్లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు