AP Secretariat : సచివాలయంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత.. అందరూ రావాల్సిందే

బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉంటుందని తెలిపింది. కోవిడ్ 19 నిబంధనలు ఎత్తివేయడంతో సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది...

AP Secretariat : సచివాలయంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత.. అందరూ రావాల్సిందే

Ap Secretariat

Covid In The AP Secretariat : ఏపీలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షలను ఎత్తివేస్తోంది. ఇప్పటికే ఉన్న రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తివేసింది. తాజాగా…సచివాలయంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేసింది. ఈ మేరకు 2022, ఫిబ్రవరి 18వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల వారు విధులకు హాజరు కావాలని ఉత్తర్వులో పేర్కొంది. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉంటుందని తెలిపింది. కోవిడ్ 19 నిబంధనలు ఎత్తివేయడంతో సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Read More : AP Covid Update : ఏపీలో కొత్తగా 495 కోవిడ్ కేసులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని సమావేశాలకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించింది. సచివాలయంలో కరోనా విలయతాండవం చేసింది. ఎంతో మంది ఉద్యోగస్తులు వైరస్ బారిన పడడంతో విధులు నిర్వహిస్తున్న వారు, ఇక్కడకు వచ్చే వారు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని వివిధ హెచ్ ఓడీ కార్యాలయాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా కేసులు పెరగడంతో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

Read More : AP BJP : విశాఖ రైల్వేజోన్‌‌కు త్వరలోనే ఆమోద ముద్ర, మా పయనం జనసేనతోనే

మరో వైపు.. ఏపీలో గత 24 గంటల్లో 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 23,15,525 కి చేరినట్లైందని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. చిత్తూరులో ఒకరు మరణించటంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,708కి చేరింది. గురువారం కోవిడ్‌కు చికిత్స పొంది 1,543 మంది కోలుకున్నారు.