Sajjala Ramakrishna Reddy : అందుకే.. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు : సజ్జల రామకృష్ణారెడ్డి

తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.. ఇది దుర్మార్గం అని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా..? అని అన్నారు.

Sajjala Ramakrishna Reddy : అందుకే.. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు :  సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy

AP Government Adviser Sajjala : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందు నుండి సీబీఐ విచారణకు సహకరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డి ఇప్పటివరకూ ఆరేడుసార్లు సీబీఐ విచారణకు వెళ్లారని తెలిపారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని, తండ్రి జైలులో ఉన్నాడు కనుక అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడని స్పష్టం చేశారు. అవినాశ్ రాసిన లేఖకు సీబీఐ నుండి ఇంకా బదులు రాలేదన్నారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

కేంద్ర బలగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కర్నూల్ ఎస్పీ సహకరించడం లేదని ఎవరు చెప్పారు..? సీబీఐ వాళ్ళు చెప్పరా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న రోజు డైవర్షన్ కోసం కేంద్ర బలగాలు అని ప్రచారం చేశారని తెలిపారు. అలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలు అభిమానంతో వస్తారని తెలిపారు.

Phone Tapping In YSRCP : ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది? చంద్రబాబుకి ఇది అలవాటే-సజ్జల

తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.. ఇది దుర్మార్గం అని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా..? అని అన్నారు. రియల్ మీడియాపై దాడి ఎక్కడైనా జరిగిందా? కరుడుగట్టిన ఎల్లో మీడియాపై దాడి జరిగి ఉండొచ్చన్నారు. తప్పుడు వార్తలు వేస్తుంటే కొందరు అభిమానులు ఆవేశంలో రియాక్ట్ అయ్యి ఉంటారని పేర్కొన్నారు. మీడియా ముసుగులో ఎల్లో మీడియా వాళ్ళు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు.

సీబీఐకు, రాష్ట్ర పోలీసులకు మధ్య ఏమీ చర్చలు జరిగాయో తెలియదన్నారు. అయినా డిపార్ట్మెంట్ టూ డిపార్ట్మెంట్ చాలా జరుగుతాయని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి ఏమైనా పరారు అవుతున్నాడా? శిక్ష పడి తప్పించుకుని తిరుగుతున్నాడా…అని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డి వారం రోజులు సమయం అడిగాడని.. సమయం ఇస్తారో లేకపోతే వచ్చి తీసుకుని వెళ్తారో తమకు తెలియదని.. తీసుకుని వెళ్ళినా పోయేదేముందన్నారు. తల్లికి కొడుకు అవసరం ఉంది కనుక అవినాశ్ రెడ్డి వారం రోజులు సమయం కావాలని కోరారని తెలిపారు.

Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని సుప్రీంకోర్టు

చంద్రబాబు అధికారంలో ఉనప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ జీఓ తెచ్చాడు.. ఈరోజు గగ్గోలు పెట్టే వాళ్ళు ఆనాడు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. అవినాశ్ కేసుకి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. అవినాశ్ తన కేసును తాను ఎదుర్కొంటాడని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా జగన్ చెయ్యాలి అనుకుంటే ఏమైనా చేయవచ్చన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నా.. ఈ విషయంలో వినియోగించ లేదని స్పష్టం చేశారు.

వైసీపీకి రీ సౌండింగ్ విక్టరీ వచ్చి నేటికీ నాలుగేళ్లు అవుతుందని అన్నారు. నాలుగేళ్లలో 98 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. అవినీతి లేకుండా నేరుగా ఇంటి వద్దకే పాలన అందించామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేయబోతున్నామన్నారు. మూడు రాజదానుల ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాగా కేంద్రం రూ.10 వేల కోట్లు విడుదల చేసిందని తెలిపారు.