Vizianagaram : ఆరేళ్ల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆరు సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయిన యువతి ఆచూకీ ఎట్టకేలకూ లభ్యమైంది. 10టీవీ సహకారంతో పువ్వల జయసుధ అనే యువతి ఆచూకీ లభ్యం అవ్వటంతో త్వరలోనే పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చునున్నారు. ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు 10టీవీకి ధన్యవాదాలు తెలిపారు.

Vizianagaram : ఆరేళ్ల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం

Vizianagaram1

Six Years Back Miss yong women : ఏపీలోని విజయనగరం జిల్లాలో గత ఆరు సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయిన యువతి ఆచూకీ లభ్యమైంది. 10టీవీ చొరవతో యువతి తల్లిదండ్రుల వద్దకు చేరనుంది. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గ్రామంలో ఆరు సంవత్సరాల క్రితం పువ్వల జయసుధ అనే యువతి కనిపించకుండాపోయింది. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.

ప్రస్తుతం సదరు యువతి పుడిచ్చేరిలోని సహోదరి-స్వధార్ గృహం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. పువ్వల జయసుధ ఇచ్చిన సమాచారంతో ఆశ్రమ నిర్వాహకులు గూగుల్ మ్యాప్ ద్వారా 10టీవీని ఆశ్రయించారు. ఆమె తమ వద్దే ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో 10టీవీ యువతితో వీడియో కాల్ ద్వారా మాట్లాడింది.అనంతరం జయసుధ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వీడియో కాల్ లో యువతి తో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇన్నాళ్లకు తమ బిడ్డ ఆచూకీ దొరికనందుకు ఆనందంలో మునిగి తేలుతున్నారు పువ్వల జయసుధ కుటుంబం సభ్యులు. తమ బిడ్డ ఆచూకీ తెలిపినందుకు 10టీవీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా..పువ్వల జయసుధను పోలీసుల త్వరలో స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పుడో తప్పిపోయిన తమ కుమార్తెను 10టీవీ సహకారంతో ఆచూకీ లభించడంపై న్న యువతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.